కాచిగూడ : మూత్ర విసర్జనకు బయటకు వెళ్లిన వృద్ధుడు అదృశ్యమైయ్యాడు.ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్సై కోటయ్య తెలిపిన వివరాల ప్రకారం గోల్నాక డివిజన్లోని సుందర్నగర్ ప్రాంతానికి జె.వెంకటేశ్(60)కు గత కొంత కాలంగా మతిస్థిమితం సరిగ్గాలేదు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం మూత్ర విసర్జనకు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పిన వెంకటేశ్ బయటకు వెళ్లి ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో వెతికినా ఆచూకి లభించకపోవడంతో భార్య వెంకటమ్మ మంగళవారం కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఇంట్లోంచి వెంకటేశ్ వెళ్లే సమయంలో తెలుపు రంగు చొక్క, తెలుపు రంగు దోతి ధరించి, ఎత్తు 5.6 ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.