పహాడీషరీఫ్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ బసవగూడ తండలో నివాస ముంటున్న సబిత (20) అనే విద్యార్థిని గత ఏడాది కాలంగా ఇంట్లోనే ఉంటుంది.
ఈ నెల 27న ఉదయం 9గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. రాత్రి అయినా తిరిగి రాలేదు. ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వచ్చింది. తల్లి కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.