బండ్లగూడ : రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పివీఎన్ఆర్ఎక్స్ప్రెస్ వే పై ఓ కారు ఉదయం పదిన్నర గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళుతుండగా టైరు పేలి పోవడంతో డివైడర్ను డీ కోట్టి రోడ్డుకు అడ్డంగా నిలిచి పోయింది.
దీంతో 15 నిమిషాల పాటు ట్రాఫిక్ స్థంభించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు టోయిన్ ద్వారా కారును అక్కడి నుంచి తరలించారు.ఈ ఘటన పై ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.