బంజారాహిల్స్ : ప్రమాదవశాత్తూ వేడినీళ్లు మీదపడి తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాంనగర్కు చెందిన షేక్ ఫయాజ్ (8) అనే బాలుడు మూడో తరగతి చదువుతున్నాడు.
ఈ నెల 9న ఫయాజ్కు స్నానం చేపించడానికి వేడినీళ్ల కోసం తల్లి బకెట్లో వాటర్ హీటర్ వేసింది. కాసేపటికి ఫయాజ్ ఆడుకుంటూ వెళ్లి బకెట్ ను తాకడంతో వేడినీళ్లు అతడి శరీరంపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఫయాజ్ను కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫయాజ్ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.