హైదరాబాద్: భారతదేశంలోకి అక్రమంగా మాదకద్రవ్యాల రవాణా పెరుగుతోంది. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ను అధికారులు పట్టుకున్నారు. 12 కిలోల హెరాయిన్ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళల వద్ద రూ.78కోట్ల విలువైన హెరాయిన్ ఉన్నట్లు గుర్తించారు. ఉగాండా, జాంబియా నుంచి ఇద్దరు మహిళలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ ఉదయమే ఎనిమిది కిలోల హెరాయిన్ను శంషాబాద్ ఎయిర్పోర్టులో స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.53కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.