చెన్నై : మాయమాటలు చెప్పి మధురైలో పదో తరగతి విద్యార్ధినిని పెండ్లి చేసుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడి (18)ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు, నిందితుడు ఏడాది నుంచి సన్నిహితంగా ఉంటూ ఇంటి నుంచి పారిపోయారు. వారు మనప్పరైలోని ఆలయంలో ఈ ఏడాది ఆగస్ట్ 15న పెండ్లి చేసుకుని మధురైలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
అదే స్కూల్లో చదువుతున్న 15 ఏండ్ల బాలిక అదృశ్యం కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఈ వ్యవహారం బయటపడింది. బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్న నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.