న్యూఢిల్లీ : ఆన్లైన్ స్కామ్లపై (Cyber Fraud) పోలీసులు ప్రజల్లో అవగాహన పెంచుతున్నా విద్యాధికులు సైతం సైబర్ నేరగాళ్ల బారినపడి సర్వం కోల్పోతున్నారు. తాజాగా ఓ టెకీ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ. 42 లక్షలు మోసపోయిన గటన వెలుగుచూసింది. పార్ట్టైం జాబ్ ఆఫర్తో ఈజీగా డబ్బు సంపాదించవచ్చని వాట్సాప్ మెసేజ్ రావడంతో స్పందించిన బాధితుడు మోసపోయాడు. గురుగ్రాం సెక్టార్ 102లో ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే వ్యక్తికి పార్ట్టైం జాబ్ ఆఫర్తో మార్చి 24న వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం ద్వారా అదనపు ఆదాయం ఆర్జించవచ్చని సైబర్ నేరగళ్లు నమ్మబలికారు. ఆపై దివ్య అనే మహిళ పేరుతో టెలిగ్రాం గ్రూప్లో అతడిని యాడ్ చేశారు. గ్రూపు సభ్యులు కమల్, అంకిత్, భూమి, హర్ష్ మెరుగైన రిటన్స్ వస్తాయని మభ్యపెట్టి అతడితో పెట్టుబడులు పెట్టించారు. దీంతో బాధితుడు తనతో పాటు తన భార్య బ్యాంక్ ఖాతాల నుంచి రూ. 42. 31 లక్షలు స్కామర్ల ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు.
ఆపై బాధితుడు రూ. 69 లక్షల లాభం ఆర్జించాడని స్కామర్లు నమ్మబలికారు. ఆ మొత్తాన్ని విత్డ్రా చేసేందుకు ప్రయత్నించగా మరింత మొత్తం పెట్టుబడులు పెట్టాలని వారు ఒత్తిడి చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు స్కామర్లను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.
Read More