మధురై : తమిళనాడులోని దిండిగల్ జిల్లా పళని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పదో తరగతి విద్యార్ధినిపై ఉపాధ్యాయుడు (30) లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని నందవనపట్టి గ్రామానికి చెందిన నత్రాయంగా గుర్తించారు. నిందితుడు వివాహితుడు కాగా ప్రస్తుతం ఈ పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిన ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాడు.
బాలికతో ఏడాది కాలంగా సన్నిహితంగా మెలుగుతున్న నిందితుడు పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి తెగబడ్డాడు. ఈ వ్యవహారం బాలిక తల్లితండ్రులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీచర్పై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.