తాండూరు : తాండూరు పట్టణ సమీపంలోని రాజీవ్ గృహకల్పన సమీపంలోని తాండూరు-హైదరాబాద్ ప్రధాన రహదారిపై శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్08ఎఫ్బి 2268 నంబర్ గల కారు, టీఎస్34డి3724 గల ద్విచక్రవానాన్ని ఢీకొనడంతో బైక్పై ఉన్న జబ్బార్ మృతి చెందాడు. సోహెన్, సోపియాన్కు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. జబ్బారును హత్య చేసేందుకే కారులో ఉన్న వ్యక్తులు బైకును ఢీకొట్టినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ యాలాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నింధితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సీఐ జలందర్రెడ్డి తెలిపారు. 24గంటల్లో పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు మీడియాతో తెలిపారు.