చెన్నై : తిరువళ్లూరు జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని (17) సోమవారం హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, మృతురాలి బంధువులతో పాటు గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, సీబీ సీఐడీకి బదిలీ చేశారు. మృతురాలు స్వస్థలం తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి అని, ఆమె తల్లిదండ్రులు దినసరి కూలీలని పోలీసులు తెలిపారు. విద్యార్థిని తిరువళ్లూరులోని మప్పేడు గ్రామంలోని కిలాచేరి గ్రామంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో బాలిక చదువుతున్నది.
సోమవారం ఉదయం బాలిక తోటి విద్యార్థినులకు ఆలస్యంగా వస్తానని చెప్పింది. హాస్టల్ గదిలోనే ఉండిపోయింది. అయితే, గంట సమయం గడిచినా పాఠశాలకు రాలేదు. దీంతో హాస్టల్ సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా.. సీలింగ్కు ఉరివేసుకొని కనిపించింది. వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హాస్టల్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.
సదరు బాలిక గత నెల రోజులుగా ఇంటికి వెళ్లడం లేదని, గత కొన్ని నెలలుగా దిగులుగా ఉందని ఆమె స్నేహితులు చెప్పారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు గ్రామస్తులు తిరుత్తణిలో రాస్తారోకో నిర్వహించారు. ఆత్మహత్యపై మప్పేడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, అనంతరం సీబీ సీఐడీకి బదిలీ చేశారు. ఇటీవల కడలూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. ప్రైవేటు పాఠశాలపై కొందరు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే.