మాదాపూర్ : అనుమానాస్పదస్థితిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం మాదా పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై హరిక తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్టకు చెందిన మినుముల ఉదయ్ రాజు (32), కేపీహెచ్బిలోని గోడెసి మిల్క్ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం కేపీహెచ్బీ నుండి ఎలక్ట్రీక్ స్కూటీపై జేఎన్టీయూ ప్లై ఓవర్ మీదుగా ఐకియా వైపు వెళ్తున్నాడు.
బాంటియా షో రూం కు ఎదురుగా ఉన్నటువంటి రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు మృతదేహన్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది.. వాహనం పై నుంచి పడ్డాడా లేదా ఏదైన వాహనం ఢీ కొట్టి ఉంటుందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.