మునగాల : పంచాయితీ పరిష్కారానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఆటోను కారు ఢీకొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందగా పలువురుకి గాయాలైన సంఘటన మండల పరిధిలోని చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండల పరిధిలోని సర్వారం గ్రామానికి చెందిన మెదరబోయిన లింగయ్య(58), అర్వపల్లి సత్యం, నూనె లక్ష్మయ్య, చెవుల ఉపాధ్యాయ్య, జాగాని గౌరమ్మ భూ వివాదం పరిష్కారం కోసం మునగాలలో సీఐ అంజనేయులు వద్ద హాజరు అయి ఆటోలో తిరిగి వెళ్తుండగా మొద్దుల చెరువు స్టేజీ వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెల్తున్న కారు ఢీకొట్టింది.
దీంతో ఆటోలో ఉన్న లింగయ్య అక్కడికి అక్కడే మృతి చెందాడు. సత్యం, లక్ష్మయ్య, ఉపాధ్యాయ్య, గౌరమ్మలకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. కారు డ్రైవర్ కూడా గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స కోసం తరలించారు. ప్రమాద వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పంచనామా కోసం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంలో ఆటో ఇంజన్ ఊడిపోయిందని తెలిపారు.