మెహిదీపట్నం: అనుమానాస్పదస్థితిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..లంగర్హౌస్ లక్ష్మీనగర్లో నివసించే శివశంకర్ నాయక్(25) డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. గురువారం ఉదయం గదిలో బెడ్షీట్తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబసభ్యులు గమనించి లంగర్హౌస్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు దర్యాప్తులో ఉంది.