అమరావతి: గంజాయి, గుట్కా ల వంటి మాదకద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక టీమ్ తో పర్యవేక్షిస్తున్నామని, నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ అబ్దుల్ హఫీజ్. గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ అబ్దుల్ హఫీజ్ ను మంగళవారం జిల్లా కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు ఆళ్ళహరి కలిసి అభినందనలు తెలిపారు. నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ఆకతాయిలకు, అరాచక శక్తులకు నిలయంగా ఉండే కొన్ని నగర శివారు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన యస్పీ హఫీజ్ కు ఆళ్ళ హరి కృతఙ్ఞతలు తెలిపారు.
నేర నియంత్రణలో భాగంగా పోలీస్ ఔట్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా శ్రీనివాసరావుతోట లోనూ పోలీస్ ఔట్ పోస్ట్ ను ఏర్పాటు చేయాలని, మందుబాబులకు నిలయమైన రాఘవయ్య పార్కు ప్రాంతంలో ప్రతీరోజూ పెట్రోలింగ్ నిర్వహించాలని యస్పీ హఫీజ్ ఆళ్ళహరి ఈసందర్భంగా కోరారు. ఈ సందర్భంగా ఆళ్ళహరి ఎస్పీ హఫీజ్ కు మాజీ రాష్ట్రపతి ఏ పీ జే అబ్దుల్ కలాం జీవిత చరిత్ర పుస్తకాన్ని బహుమతిగా అందచేశారు.