జైపూర్: నకిలీ కరెన్సీ నోట్లు ముద్రిస్తున్న ఇద్దరిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్లో రూ.500, రూ.200, రూ.100 నకిలీ నోట్లు ముద్రిస్తున్నట్లు సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) పోలీసులు రైడ్ చేశారు. నకిలీ నోట్ల ముద్రణకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రూ .5,80,900 విలువైన నకిలీ కరెన్సీతోపాటు ప్రింటింగ్ మెషిన్, లామినేటర్ వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జైపూర్ పోలీసులు తెలిపారు.