బండ్లగూడ : అనారోగ్యంతో అస్పత్రిలో చికిత్స పొందుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ని అత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లాకు చెందిన సుదూక్తి (27) హైదర్షాకోట్లో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది.
ఈ నెల 6న ఆనారోగ్యంతో స్థానికంగా ఉన్న అస్పత్రిలో అమె చేరింది. మంగళవారం మధ్యాహ్నం అమె ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని మృత దేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియ ఆస్పత్రికి తరలించారు.అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..