చెన్నై : రూ 10 కోట్ల విలువైన 20 టన్నుల ఏ గ్రేడ్ స్మగుల్డ్ ఎర్ర చందనం దుంగలను తమిళనాడు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మధురై-ట్యుటికోరిన్ జాతీయ రహదారిలో పూడూర్ పందియపురం టోల్ప్లాజా సమీపంలోని యార్డ్ వద్ద ట్రక్లో ఈ దుంగలను భద్రపరిచారు.
స్మగ్లర్ల నుంచి 150 దుంగలను స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ జీ చందీష్ వెల్లడించారు. కొద్దివారాల కిందట ఎర్రచందనం దుంగలను ఆంధ్రప్రదేశ్ నుంచి మధురై మీదుగా ట్యుటికోరిన్కు తరలించారని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. వాటిని ఎగుమతి చేయడం కష్టం కావడంతో ట్యుటికోరిన్లోని యార్డ్లో భద్రంగా దాచారని పోలీసులు తెలిపారు.
ఎర్రచందనం దుంగలను పరిశీలించిన అటవీ శాఖ అధికారులు ఇవి అత్యుత్తమ నాణ్యతతో ఉన్నాయని, వీటి విలువ రూ 10 కోట్లపైనే ఉంటుందని అంచనా వేశారు. ట్రక్కు యజమాని, యార్డ్ ఓనర్తో పాటు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.