జైపూర్ : మట్టిదిబ్బ కూలిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు బాలికలు, మరో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ విషాదకర ఘటన రాజస్థాన్ కరౌలి జిల్లాలోని సపోత్రా సబ్ డివిజన్లో సోమవారం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు.. సిమర్ పంచాయతీ మేడ్పురాకు చెందిన మహిళలు, బాలికలు మధ్యాహ్నం సమయంలో పొలాల వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుగుండా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా మట్టిదిబ్బ కూలిపోయింది.
మట్టిలో కూరుకుపోయి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నలుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.