Beef Samosas : గుజరాత్లోని వడోదరలో బీఫ్ సమోసాలను విక్రయిస్తున్న సమోసా షాప్ యజమాని సహా ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీఫ్ సమోసాలను విక్రయిస్తున్నారనే సమాచారంతో చిప్వాద్ ప్రాంతంలోని హుస్సేని సమోసా దుకాణంపై దాడి చేసి సరుకును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.
బీఫ్ సమోసాలను పెద్దసంఖ్యలో స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఎఫ్ఎస్ఎల్ పరీక్షలకు పంపారు. సమోసాల్లో ఆవు మాంసం చొప్పించారని పరీక్షల్లో తేలడంతో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని డీసీపీ పన్నా మొమయా తెలిపారు.
నిందితులను షాపు యజమానులు యూసుఫ్ షేక్, నయీం షేక్ ఉద్యోగులు హనీఫ్ భతియర, దిలావర్ పఠాన్, మొయిన్ హబ్దల్, మొబిన్ షేక్గా గుర్తించారు. ఇవి మీట్ సమోసాలుగా భావించి నగరంలో పలువురు ఈ సమోసాలను తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. వీటిని మీట్ సమోసాలుగా నిందితులు నగరంలోని రిటైల్ షాప్ యజమానులకు విక్రయిస్తున్నారని చెప్పారు.
Read More :