లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాని గురువారం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు పట్టుకున్నారు. మూడు లాడ్జిల మీద దాడులు చేసిన సీసీబీ అధికారులు వ్యభిచారం ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ దాడుల్లో ఒక హోటల్ కింది భాగంలో మహిళల్ని దాచపెట్టడం కోసం ఏర్పాటుచేసిన రహస్య గదిని కనిపెట్టారు. వ్యభిచార ముఠాతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ ఏడుగురు మహిళల్ని రెస్క్యూ హోమ్కు తరలించారు.
వాసవి లాడ్జ్, దుర్గా ప్యాలెస్తో పాటు మరొక లాడ్జిలో వ్యభిచారం నడిపిస్తున్నారనే సమాచారంతో గురువారం సీసీబీ అధికారులు దాడి చేశారు. గతంలో కూడా ప్రైవేట్ లాడ్జిల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న పలువురిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ మహిళల్ని రెస్క్యూ హోమ్స్కు తరలించారు.