కాచిగూడ : రోడ్డు దాటుతుండగా మహిళను ద్విచక్రవాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన కనకప్ప భార్య ఆర్.లక్ష్మి(28) రేషన్కు వెళ్లి బియ్యం తీసుకొని ఇంటికి వస్తుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొనడంతో లక్ష్మి ఎడమ కాలు విరిగిందని పోలీసులు తెలిపారు.
భర్త కనకప్ప కాచిగూడ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.