హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. శనివారం దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జ్యూసర్లో అమర్చి అక్రమంగా తరలిస్తుండగా.. తనిఖీలు నిర్వహించి 617 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. బంగారం రూ.34లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తి అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు.