హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇద్దరు సూడాన్ దేశ మహిళలను సీఐఎస్ఎఫ్ ఇంటిలిజెన్స్ బృందం పట్టుకున్నది. ఇద్దరు సోమవారం మధ్యాహ్నం ఎయిర్ అరేబియా (G9-459/0425) విమానంలో షార్జా ఖార్టుమ్ వయా షార్జా నుంచి హైదరాబాద్కు వచ్చారు. దీంతో వారిపై అనుమానం వచ్చిన సీఐఎస్ఎఫ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకొని బ్యాగులను తనిఖీ చేశారు. దీంతో వివిధ దేశాలకు చెందిన రూ.13లక్షల విలువైన కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి.
కరెన్సీని స్వాధీనం చేసుకొని, ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం వారిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అలాగే బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న మహిళను అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి ఇండిగో ఫ్లైట్ (6E025) హైదరాబాద్కు మహిళ నుంచి 350 గ్రామాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.17.69లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.