పట్నా : బిహార్లోని సహర్స పోలీస్ స్టేషన్లో ఓ పోలీస్ అధికారి మహిళతో మసాజ్ చేయించుకుంటున్న వీడియో కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే అధికారి శశిభూషణ్ సిన్హాను సస్పెండ్ చేశారు. మూడు సెకండ్ల వ్యవధి కలిగిన ఈ వీడియోలో పోలీస్ స్టేషన్లో షర్ట్ లేకుండా ఉన్న సిన్హాకు మహిళ మసాజ్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
కుమారుడిని జైలు నుంచి విడిపించాలని కోరేందుకు మహిళ పోలీస్ స్టేషన్కు వచ్చింది. మహిళను తనకు మసాజ్ చేయాలని కోరిన శశిభూషణ్ సిన్హా త్వరలోనే ఆమె కొడుకును విడుదల చేయిస్తానని నమ్మబలికాడు. ఆమె ఎదుటే లాయర్కు ఫోన్ చేసిన సిన్హా నిందితుడిని బెయిల్పై విడిపించాలని కోరాడు.
బాధితురాలు పేద మహిళని ఆమె కొడుకు బెయిల్ కోసం తాను ఇప్పటికే రూ 10,000 ఖర్చు చేశానని, ఇంకా ఎంత డబ్బు ఇవ్వాలని ఫోన్లో అడిగాడు. సోమవారం ఇద్దరు మహిళలు తమ ఆధార్ కార్డులతో వస్తారని, వారితో కవర్లో డబ్బు పెట్టి పంపుతానని చెప్పుకొచ్చాడు. వీడియో వైరల్ కావడంతో సహర్స ఎస్పీ లిపి సింగ్ శశిభూషణ్ సిన్హాను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.