తాడ్వాయి, ఫిబ్రవరి 17 : బీరు సీసా పేలడంతో ఆర్టీసీ డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాప్ వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకొన్నది. ఆర్టీసీ డ్రైవర్ భక్తులను తాడ్వాయికి తరలించిన తరువాత బస్సును బస్టాప్లో నిలిపాడు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న దుకాణంలో బీరు కొనుగోలు చేసి బొడ్లో పెట్టుకొని వెళ్తున్న క్రమంలో బాటిల్ పేలింది. ఈ ప్రమాదంలో సదరు డ్రైవర్ పొట్ట భాగంలో తీవ్ర గాయం కాగా కడుపులోని పేగులు బయటకు వచ్చినట్టు తెలిసింది. సహచర డ్రైవర్లు వెంటనే అతడిని 108 వాహనంలో హైదరాబాద్కు తరలించారు.