ఇందూరు : కోళ్ల దాణ వాహనంలో గుట్టు చప్పుడు కాకుండా గుట్కాను తరలిస్తున్న ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 26న నిజామాబాద్ పట్టణంలో న్యాల్కల్ చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఐచర్ వాహనాన్ని సోదా చేశారు. కోల్ల దాణ బస్తాల వెనుక గుట్కా సంచులను గుర్తించారు. రాణీ బ్రాండ్ గుట్కా 40 సంచులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు వివరాలను వెల్లడించారు.
పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా గుట్కా అసలు వ్యాపారులు రఫత్, ఇబ్రహీంలను విచారించగా ఐచర్ వాహనం డ్రైవర్ మహ్మద్ సల్మాన్ కర్నాటక రాష్ట్రంలోని హుమ్నాబాద్ నుంచి బోధన్ మీదుగా నాందేడ్కు గుట్కా రవాణా చేస్తున్నాడని వివరించారు. దీంతో ఐచర్లో దొరికిన రాణీ బ్రాండ్ గుట్కా విలువ రూ. 12లక్షలు, రఫత్ ఇచ్చిన సమాచారం మేరకు నిజామాబాద్లోని మహ్మద్ అల్తాఫ్ ఇంటిలో 8 విమల్ గుట్కా సంచుల్లో ఉన్న రూ.3లక్షల 50 వేల రూపాయలు గల గుట్కాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం షేక్ రఫత్, మహ్మద్ ఇబ్రహీం, మహ్మద్ సల్మాన్ (ఐచర్ వ్యాన్డ్రైవర్), మహ్మద్ అల్తాఫ్, షేక్ గౌస్ కస్టడీలో, మహ్మద్ సల్మాన్, షేక్ రఫత్పై కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ అరవింద్ బాబు తెలిపారు.