అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వేర్వేరూ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మరణించాడు. ఘటనలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్థంభించిపోయింది. పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తుండగా సంగం డెయిరీకి చెందిన పాల వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో హోంగార్డుతో పాటు లారీ యజమాని మరణించగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్కు తరలించి చికిత్స అందజేస్తున్నారు.
నంద్యాల జిల్లా తమ్మరాజుపల్లి అడ్డవాగు పాణ్యం వద్ద కల్వర్టును కారు ఢీ కొట్టింది బోల్తా పడింది. సంఘటనలో కడపజిల్లా చిట్వేలుకు చెందిన పి.సుబ్బారామరాజు(60), అతని కుమారుడు కుమార్ రాజు(37) మృతి చెందారు. ఈ ఘటనపై పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.