ఇండోర్ : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండోర్ – ఖాండ్వా మార్గంలో బస్సు 50 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 40 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో 50 మందికిపైగా ప్రయాణికులున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో నుంచి క్షతగాత్రులను రక్షించి, ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు ఇండోర్ నుంచి ఖాండ్వా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. సిమ్రోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భైరవ్ ఘాట్పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోయలో పడిపోయిందని సమాచారం.