అమరావతి : కోనసీమ జిల్లాలో ఓ ఆర్ఎంపీ వైద్యుడు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. జిల్లాలోని మామిడికుదురు మండలంలో చోటు చేసుకున్న ఘటన వివరాలను ఇన్చార్జి ఎస్సై కృష్ణామాచారి వెల్లడించారు. ఏడో తరగతి చదువుతున్న 14 ఏండ్ల విద్యార్థిపై ఆర్ఎంపీ వేగి రమేశ్ వైద్యం చేసేందుకు ఆరు నెలల కిందట బాలిక ఇంటికి వచ్చి ఆమె వద్ద పోన్ నెంబర్ తీసుకుని పరిచయం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి తండ్రి ఇంట్లో నిద్రిస్తుండగా బాలిక డాబాపై పడుకున్న సమయంలో వైద్యుడు అక్కడికి చేరుకుని బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఎస్సై వివరించారు.
ఆ సమయంలో బాలిక అమ్మమ్మ కాలకృత్యాల కోసం బయటకు రాగా డాబాపై తన మనవరాలిని బలత్కారం చేస్తున్న విషయాన్ని గమనించడంతో వైద్యుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్చార్జి ఎస్సై వెల్లడించారు.