భోపాల్ : 81 ఏండ్ల వయసులో మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేయాల్సిన రిటైర్డ్ ప్రొఫెసర్ కామంతో రగులుతూ వయసులో తన కంటే ఎంతో చిన్నదైన పనిమనిషిపై మరో పెద్దాయనతో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. భోపాల్లోని రిటైర్డ్ ప్రొఫెసర్ దేవేంద్ర పాండే తన స్నేహితుడు, వ్యాపారి శివ్నారాయణ్ పాండే (60) ఫాంహౌస్లో ఆగస్ట్ 8న ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఫాంహౌస్లో పనిమనిషిపై వీరిద్దరూ సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
సెహోర్ జిల్లాకు చెందిన బాధిత మహిళ (38) గత 21 ఏండ్లుగా పాండే ఫాంహౌస్లో పనిచేస్తోంది. గతంలోనూ శివనారాయణ్ పాండే తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత మహిళ ఆరోపించింది. తాను స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన పాండే గత ఏడాదిగా తనను బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడని పేర్కొంది. బాధితురాలు ఆదివారం భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.