మంచాల : అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకేట్లను మంచాల పోలీసులు ఆదివారం మధ్యాహ్నం పట్టుకున్నారు. మంచాల ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఎండీ షకీల్, ఎస్కే అబ్దుల్లా స్కూటీపై మంచాల మండలం వివిధ గ్రామాల్లో ఉన్న కిరాణ షాపులకు నిషేధిత గుట్కాను తరలిస్తున్న విషయం తెలుసుకుని రంగాపూర్ చౌరస్తాలో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో రూ. 18వేల విలువైన 116 గుట్కా ప్యాకేట్లు లభించాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు మంచాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.