షాద్నగర్ : ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు వస్తున్న ఓ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం బూచ్చిగూడ గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుచ్చిగూడ గ్రామానికి చెందిన బలవంత్రెడ్డి (45) అనే రైతు తన సమీప బంధువుల శుభకార్యంలో పాల్గొనేందుకు బుచ్చిగూడ నుంచి షాద్నగర్ వైపు తన బైకుపై వస్తున్నాడు. ఇందులో భాగంగానే బైకు బుచ్చిగూడ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న టిప్పరును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బలవంత్రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరో ఐదు నిమిషాలలో శుభకార్యంలో పాల్గొనేందుకు వస్తాడకున్న కుటుంబ సభ్యులకు మృతి చెందడానే వార్త విని ఒకసారిగి కుప్పకోల్పాయారు. రోడ్డు ప్రమాద సంఘటనపై బుచ్చిగూడ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. జరిగిన సంఘటనపై షాద్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.