జైపూర్: ఏడవ తరగతి విద్యార్థినిపై ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు లైంగిక దాడి చేశాడు. రాజస్థాన్లోని ఝున్ఝన్హు జిల్లాలో ఈ దారుణం జరిగింది. 11 ఏండ్ల బాలికపై 31 ఏండ్ల టీచర్ ఈ నెల 5న స్కూలు తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. దీంతో బాధితురాలు కొన్ని రోజులు మౌనం వహించింది. అయితే తరగతి పుస్తకంలోని చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ను చూసిన ఆ బాలిక గురువారం ఫోన్ చేసింది. జరిగిన దారుణం గురించి చెప్పింది. దీంతో పిల్లల సంరక్షణ కమిటీ సభ్యులు ఆ బాలిక ఇంటికి వచ్చారు. టీచర్ లైంగిక దాడి గురించి ఎస్పీకి తెలిపారు. నిందితుడు ఆమెకు కొంత కాలంగా అసభ్య సందేశాలు పంపుతున్నట్లు చెప్పారు.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అల్వార్ జిల్లాలో కుటుంబంతో కలిసి ఉన్న కీచక ఉపాధ్యాయుడ్ని గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు. కాగా నిందితుడి కుటుంబమంతా విద్యావంతులని, అతడి భార్య కూడా మరో జిల్లాలో టీచర్గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.