రాజాపేట : వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బోర్లపడి ఊపిరి ఆడక రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని దూదివెంకటాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎమ్మ బాలసిద్ధులు(48) తన వ్యవసాయ పొలంలో గంపలో నారు తీసుకపోతున్న క్రమంలో ప్రమాదవశాత్తు బురదలో బోర్లపడిపోయి ఊపిరి ఆడక మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.