Punjab : ఆన్లైన్లో గన్ కల్చర్కు సంబంధించిన పోస్టులను మూడు రోజుల్లోగా తొలగించాలని డీజీపీ గౌరవ్ యాదవ్ పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆలోపు పోస్ట్లు తీసేసినవాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోమని తెలిపారు. ఒకవేళ అలా చేయని పక్షంలో తుపాకీ సంస్కృతిని ప్రేరేపించే పోస్టులు పెట్టిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈమధ్యే ఒక పదేళ్ల కుర్రాడు సోషల్మీడియాలో బొమ్మ తుపాకీ ఫొటో పెట్టాడు. దాంతో, అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాబ్లో తుపాకులను బహిరంగంగా, సోషల్మీడియాలో ప్రదర్శించడం పట్ల నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో మరింత మంది అలాంటి పోస్ట్లు పెట్టకుండా చూడడం కోసం డీజీపీ కార్యాలయం శనివారం అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది.
’72 గంటల్లో ప్రజలు తమ సోషల్మీడియా ఖాతాల్లో అభ్యంతరకరంగా ఉన్న పోస్టులను తొలగించాలి. వచ్చే మూడు రోజుల్లో ఎవరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు వాళ్లంతల వాళ్లుగా గన్ కల్చర్ పోస్ట్లను తొలగించేందుకు సమయం ఇస్తున్నాం’ అని ఈ ట్వీట్లో ఉంది.
పంజాబ్లో డ్రగ్స్తో పాటు గన్ కల్చర్ కూడా పెరుగుతోంది. మే నెలలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బృందంలోని సభ్యులు సింగర్, ర్యాపర్ సిద్దూ మూసే వాలాను నడి రోడ్డు మీదే కాల్చి చంపారు. గతంలోనూ పంజాబ్లో గ్యాంగ్వార్లు జరిగాయి.
Appeal to Everyone to voluntarily remove any objectionable content from their Social Media handles in the next 72 hours.
CM Punjab has directed that no FIRs for glorifying weapons will be registered for the next 3 days in Punjab to allow people to remove content on their own. pic.twitter.com/JwkrYVhN3N
— DGP Punjab Police (@DGPPunjabPolice) November 26, 2022