ముంబై : గత ఏడాదిగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్లు (Cyber Fraud) విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్తో సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ వేదికగా అమాయకుల ఖాతాల నుంచి అడ్డంగా దోచేస్తున్నారు. సైబర్ స్కామ్ల గురించి అధికారులు, పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నా సైబర్ నేరగాళ్లు అందరి కండ్లు కప్పి చెలరేగుతున్నారు.
ఇక తాజా ఘటనలో పుణేకు చెందిన 34 ఏండ్ల టెకీ ఆన్లైన్లో అదనపు ఆదాయం ఆర్జించే క్రమంలో రూ. 17 లక్షలు పైగా పోగొట్టుకున్నాడు. వీడియోలను లైక్ చేస్తూ పార్ట్టైం జాబ్ ద్వారా అదనపు రాబడి ఆర్జించవచ్చనే యాడ్ సోషల్ మీడియాలో టెకీ కంటపడింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్య స్కామర్లు ఇచ్చిన టాస్క్లను టెకీ పూర్తిచేశాడు.
ఈ క్రమంలో బాదితుడు రూ. 17 లక్షలు పోగొట్టుకున్నాడు. మోసపోయానని గుర్తించిన బాధితుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సైబర్ ఫ్రాడ్ వెలుగుచూసింది. బాధితుడి ఖాతా నుంచి సొమ్ము దోచేసిన స్కామర్లు ఆ మొత్తాన్ని కొచ్చి, జైపూర్, మాల్ధా, ఇటార్సి వంటి భిన్న ప్రాంతాలకు తరలించినట్టు వెల్లడైంది.
Read More :