వైరా రూరల్ : ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో నిర్వహిస్తున్న జాతరలో శనివారం అపశృతి చోటు చేసుకుంది. పిండ ప్రదానాల పూజలు చేస్తున్న అర్చకుడు గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లాడ మండలం అన్నారుగూడేనికి చెందిన అమిదేవవురపు వెంకటేశ్వర్లు(48) మృతి భక్తులను కలిచివేసింది. వైరా ఎస్సై శాఖమూరి వీరప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అర్చకుడి వివరాలను సేకరించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.