గౌహతి: ఒక వ్యక్తి కస్టడీ మరణంపై ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్ స్టేషన్కు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. అస్సాంలోని నాగోన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సల్నాబరి ప్రాంత్రానికి చెందిన చేపలు అమ్మే సఫీకుల్ ఇస్లాంను, బటద్రవ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లంచగా పది వేలు, ఒక బాతును డిమాండ్ చేసినట్లు అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
మరోవైపు పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉన్న సఫీకుల్ ఇస్లాంను చూసేందుకు అతడి కుటుంబ సభ్యులు శనివారం పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అయితే అతడు అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. దీంతో ఆసుపత్రికి వెళ్లి చూడగా మృతదేహం మార్చురీలో ఉన్నది. దీంతో ఆగ్రహించిన సఫీకుల్ ఇస్లాం కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. నిప్పు పెట్టి అక్కడి ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. లంచం ఇవ్వనందుకే సఫీకుల్ ఇస్లాంను పోలీసులు చంపారని అతడి కుటుంబం ఆరోపించింది.
కాగా, మద్యం తాగి రోడ్డుపై పడి ఉన్న సఫీకుల్ ఇస్లాంను పోలీస్ స్టేషన్కు తరలించగా అనారోగ్యానికి గురై చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్కు స్థానికులు నిప్పు పెట్టిన ఘటనలో ముగ్గురు గాయపడినట్లు చెప్పారు. ఈ హింసా ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.