ఉప్పల్/ రామంతాపూర్, ఏప్రిల్ 12: పట్టువదలలేదు.. ధైరం సడలలేదు.. వట్టిచేతులతో గొలుసు దొంగను పట్టుకున్నది ఓ ధీర వనిత. రామంతాపూర్ గాంధీనగర్కు చెందిన రూపారాణి (50) గృహిణి. రోజులాగే సోమవారం గాంధీనగర్లోని ఇంటినుంచి చర్చికాలనీ ప్రధాన రహదారి ద్వారా కమాన్ వరకు వాకింగ్ చేస్తున్నా రు. ఉదయం 7.30 సమయంలో చర్చికాలనీ కమాన్ నుంచి గాం ధీనగర్కు వెళ్తుండగా వెనుకనుంచి బైక్పై వచ్చిన ఇద్దరు చైన్ స్నాచ ర్లు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఒకడు బైక్పైనే ఉండగా, ఒక వ్యక్తి ఆమెను సమీపించి మెడలోని గొలుసును లాగాడు. వెంటనే అప్రమత్తమైన రూపారాణి ఆ వ్యక్తి చేతిని, చైన్ను గట్టిగా పట్టుకుంది. చేతిని విడిపించుకోవడానికి దొంగ ఎంత ప్రయత్నించినా ఆమె వదల్లేదు. వాహనంపైన ఉన్న మరో దుండగుడు వచ్చి తన సహచరుడిని విడిపించే ప్రయ త్నం చేసినా ఆమె మరింత గట్టిగా పట్టుకొంది. దుండగులు రూపారాణిని రోడ్డుపైకి తోసేసినా ఆమె పట్టు వదలకుండా గట్టిగా కేకలు వేశారు. ఇంతలో అటుగా వస్తున్న ఆటోలోని వ్యక్తులు వారి దగ్గరకు పరుగెత్తుకు రావటంతో ఒక దుండగుడు పారిపోయారు. రూపారాణి చేతికి చిక్కిన యువకుడిని స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించారు. తోపులాటలో రూపారాణికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ కూడా చదవండి…