బంజారాహిల్స్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న పేకాటశిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ సైట్-2కు చెందిన బి.ఏడుకొండలు (40) అనే వ్యక్తి బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని కృష్ణానగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కే.నాగేశ్వర్రావు ఆదేశాలతో మంగళవారం రాత్రి స్థానిక పోలీసులు ఆ ఇంటిపై దాడులు చేశారు.
అక్కడ పేకాడుతున్న నిర్వాహకుడు ఏడుకొండలుతో పాటు వెంకటగిరికి చెందిన టైలర్ మహ్మద్ సలీం(45), షేక్ సిరాజ్ (30) డి.ఉదయ్ (29), ఏ సురేష్ (30), ఎం.వర్మ (27) తదితరులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వీరివద్దనుంచి రూ.61,780 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.