మలక్పేట : కేవలం గంటన్నర వ్యవధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎనిమిది సెల్ఫోన్లు తస్కరించి ఐదు నెలలక్రితం జైలుకెళ్లిన పాత నేరస్థుడిపై మలక్పేట పోలీసులు పీడీ యాక్ట్ను ప్రయోగించారు.
సీఐ నాను నాయక్ కథనం ప్రకారం డబీర్పురాకు చెందిన సయ్యద్ ముదాస్సిర్ (21) ఐదు నెలలక్రితం (జూలై నెలలో ఉదయం ఆరుగంటల నుంచి ఏడున్నర గంటలవరకు) కేవలం గంటన్నర వ్యవధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎనిమిది సెల్ఫోన్లు తస్కరించాడు. అదేరోజు మలక్పేట పోలీసులు నిందితున్ని పట్టుకొని కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించగా, కోర్టు జైలుశిక్ష విధించింది.
ప్రస్తుతం నిందితుడు చంచల్గూడ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే నిందితుడి నేర ప్రవృత్తి, తీవ్రతను బట్టి పోలీసు ఉన్నతాధికారుల సూచన మేరకు పీడీ యాక్ట్ను ప్రయోగించామని, దాంతో నిందితుడు మరో ఏడాదిపాటు జైలు శిక్షను అనుభవించనున్నాడని నాను నాయక్ తెలిపారు.