అమరావతి : ఎర్రచందనం అడవుల నరికివేత సమస్యను కారకులైన స్మగ్లర్లపై కడప జిల్లా పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరుడు గట్టిన ముగ్గురు అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు చాపాడు మండలం ఖాదర్పల్లికి చెందిన షేక్ చాంద్బాషా, ఒంటిమిట్ల మండలం చింతరాజు పల్లెకు చెందిన జంగాల వీరభద్రయ్యపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసినట్లు కడప ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన షరీప్తో కలిసి ఇద్దరు ఏడేండ్లుగా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
చాంద్బాషాపై ఎనిమిది కేసులు, వీరభద్రయ్యపై ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. వీరంతా తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి కడప జిల్లాలోని అట్లూరు, రాయచోటి , భాకరాపేట, గువ్వల చెరువు, సిద్ధవటం, సుండుపల్లి, రైల్వేకోడూరు, ఘాట్రోడ్డు, వీరబల్లి తదితర అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు నరికి దుంగలను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు.