|
బంజారాహిల్స్ : షాపు ముందు పార్కింగ్ చేసిన యాక్టివా బైక్ చోరీకి గురయిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దారుషఫా ప్రాంతంలోని నూర్ఖాన్ బజార్కు చెందిన డి.ప్రకాష్ అనే వ్యక్తి బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని ఇన్కంటాక్స్ కాలనీకి ఎదురుగా టిక్టాక్ పేరుతో డ్రైక్లీనింగ్ షాపు నడిపిస్తు న్నాడు.
ఈ నెల 26న మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో తన యాక్టివా బైక్ (టీఎస్ 11 ఈఆర్ 8522)ను షాపు ముందు పార్క్ చేశాడు. సాయంత్రం బయటకు వచ్చి చూడగా పార్కింగ్ చేసిన యాక్టివా బైక్ కనిపించలేదు. అన్ని ప్రాంతాల్లో గాలించినా లాభం లేకపోవడంతో ఆదివారం బాధితుడు ప్రకాష్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.