వికారాబాద్ : నవ వధువరులు ఉన్న కారు వరద నీటిలో కొట్టుకపోయిన సంఘటన తిమ్మాపూర్ గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్పల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన మైలారం నవాజ్రెడ్డి, భార్య శ్వేత, అక్క ప్రవళిక, డ్రైవర్ రాఘవేందర్రెడ్డిలు కారులో వెళ్తున్నారు. తిమ్మాపూర్ గ్రామ సమీపంలో ఉదృతంగా వాగు పారుతుండటంతో వాగులోంచే కారును తీసుకెళ్లడంతో నీటి ప్రవాహనికి కారు కొట్టుకుపోయింది. దీంతో వారు గళ్లంతైనారు. నవ వధువరులకు ఈ నెల 26న వివాహం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం కుండపోత వర్షం కురవడంతో మండల పరిధిలోని సిద్దులూర్ వాగు, మోమిన్పేట మండలంలోని కాస్లాబాద్ వాగు, మర్పల్లిలోని తిమ్మాపూర్ వాగులు ఉదృతంగా ప్రవహించాయి. నవాబుపేట మండలంలోని ఎల్లకొండ గ్రామ సమీపంలో వాగు పారడంతో వరదకు కొట్టుకోపోతున్న కారును మరో రైతు తన ట్రాక్టర్తో ఆపి వారి ప్రాణాలు కాపాడారు.