న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఉన్న తల్లికి మందుల కోసం సహాయం కోరిన బాలికపై పొరుగింటి వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. ఈ నెల 22న పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన బాలిక తల్లి అస్వస్థతకు గురైంది. తండ్రి సొంత గ్రామానికి వెళ్లడంతో తల్లితో కుమార్తె ఒక్కతే ఉన్నది. దీంతో తల్లికి మందుల కోసం పొరుగున ఉన్న అరుణ్ అనే వ్యక్తి సహాయాన్ని ఆ బాలిక కోరింది.
దీంతో మందులు ఇప్పిస్తానంటూ బాలికను తన వెంట మరో చోటకు తీసుకెళ్లిన ఆ వ్యక్తి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, బాధిత బాలిక తన పెరేంట్స్తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం అరుణ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.