న్యూఢిల్లీ: ఒక మహిళతో యువకుడికి సంబంధం ఏర్పడింది. అయితే దీనిని ఆమె కుమార్తె వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో ఆ యువకుడు ఆ యువతిని హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. తిక్రీ సరిహద్దులోని ముండ్కా పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల మహిళ, 18 ఏళ్ల హరీష్ కుమార్ కలిసి బహదూర్గఢ్లోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య ఏర్పడిన పరిచయం లైంగిక సంబంధానికి దారి తీసింది. ఈ విషయం ఆ మహిళ కుమార్తెకు తెలిసింది. దీంతో తల్లితో ఆ యువకుడి ప్రవర్తనపై 17 ఏళ్ల బాలిక ఆందోళన చెందింది. వారిద్దరి సంబంధాన్ని ఆమె వ్యతిరేకించింది.
ఈ నేపథ్యంలో ఆ మహిళ యువ ప్రియుడు హరీష్ కుమార్ దారుణానికి పాల్పడ్డాడు. బుధవారం లేక్ రామ్ పార్క్ సమీపంలో ఆ మహిళ కుమార్తెపై కత్తితో దాడి చేసి ఆమె గొంతు కోశాడు. గమనించిన స్థానికులు అతడ్ని పట్టుకున్నారు. సమాచారం అందుకుని అక్కడకు వచ్చిన పోలీసులు ఆ యువకుడ్ని అరెస్ట్ చేశారు.
మరోవైపు తీవ్రంగా గాయపడిన యువతిని సీఎస్సీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోస్ట్మార్టం కోసం యువతి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముండ్కా పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లిదండ్రుల స్టేట్మెంట్ను రికార్డు చేస్తామని చెప్పారు.