ముంబై : ఆన్లైన్ చదువుల కారణంగా చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులేమో వారు ఎక్కడ చదువులకు దూరం అవుతారో అనే బెంగతో మానసిక వ్యాధులకు గురవుతున్నారు. సరిగ్గా ఇలాంటి కారణమే.. ఓ మూడున్నరేండ్ల చిన్నారిని (Online Murder) చంపేసింది. ఆన్లైన్ తరగతులకు సక్రమంగా హాజరవడం లేదని, చదువులపై దృష్టిపెట్టడం లేదని విపరీతంగా ఆగ్రహానికి గురైన ఓ తల్లి.. తన కుమారుడిని దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం తాను కూడా ఉరేసుకుని బలవంతపు మరణానికి పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్లో జరిగింది.
నాసిక్లోని సాయి సిద్ధి అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు తలుపులు తెరిచి చూడగా.. బెడ్రూంలో 30 ఏండ్ల వయసున్న శిఖాసాగర్ పాఠక్ అనే వివాహిత ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయి కనిపించింది. అక్కడే మంచంపై ముక్కులో నుంచి రక్తం కారి చనిపోయిన మూడేండ్ల చిన్నారి పడివుంది. ఈ ఘటన సోమవారం జరిగింది. ఇంట్లో భర్తగానీ, ఆమె తల్లిదండ్రులుగానీ లేరు. తలుపులకు గడియవేసి ఉన్నది. తమ చావులకు ఎవరూ బాధ్యులు కారని అక్కడ దొరికిన సూసైడ్ నోట్లో రాసి ఉన్నది. చిన్నారి ఆన్లైన్ క్లాస్లపై శ్రద్ధ చూపడం లేదని, సక్రమంగా చదవకపోవడంతో విపరీతమైన కోపం వచ్చి దిండుతో ముఖంపై అద్ది చంపేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నట్లు దర్యాప్తు చేస్తున్న ఏసీపీ సోహాలీ షేక్ తెలిపారు. ఆన్లైన్ చదువుల విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒత్తిడి తేవద్దని, పిల్లల చదువుల విషయంలో మానసిక ఇబ్బందులకు గురవ్వద్దొని ఈ సందర్భంగా పోలీసులు సూచిస్తున్నారు.
చేతిలో భగవద్గీత.. నవ్వుతూ ఉరికంభంపైకి..
ఇలా నీరజ్ ‘పసిడి’కి గుర్తింపు..
వీరి నివాసం కేరాఫ్ పోలీస్ స్టేషన్..!
నీరజ్ చోప్రా ‘పసిడి’ రహస్యమిదే..?!
అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..