రంగారెడ్డి : మొయినాబాద్లోని సురభి ఎన్క్లేవ్లోని ఓ గదిలో పేకాట ఆడుతున్నట్లు శంషాబాద్ ఎస్వోటీ, మొయినాబాద్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో పోలీసులు సురభి ఎన్క్లేవ్లోకి ప్రవేశించి.. పేకాట ఆడుతున్న గదిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 14,71,200ల నగదుతో పాటు ఏడు సెల్ఫోన్లు, ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో శ్యాంసుందర్ రెడ్డి, ఎండీ జహంగీర్, పాండు, మహేందర్ రెడ్డి, సురేశ్, రవీందర్ రెడ్డి, ప్రశాంత్, మధుసూదన్ రెడ్డి, మల్లేశ్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.