ముంబై : మాజీ మిస్ ఇండియా యూనివర్స్, మోడల్ పారి పాశ్వాన్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు డ్రగ్స్ కలిపిన డ్రింక్ ఇచ్చి అశ్లీల వీడియో షూట్ చేశారని ముంబైలోని ఓ ప్రొడక్షన్ హౌస్పై ఆమె ఆరోపణలు చేశారు. రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ ఇటీవల వెలుగుచూసిన నేపథ్యంలో మోడల్ ఆరోపణలు దుమారం రేపాయి.
జార్ఖండ్కు చెందిన పారి మోడల్గా పనిచేస్తూ అవకాశాల కోసం ముంబై వచ్చిన క్రమంలో ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. అయితే ఆమె పోర్న్ వీడియోలను చిత్రీకరించిన ప్రొడక్షన్ హౌస్ పేరు, ఎవరు తనను ఈ ఊబిలో ఇరికించారనే వివరాలను ఆమె వెల్లడించలేదు. తనకు కూల్డ్రింక్లో డ్రగ్స్ కలిపి ఇచ్చిన అనంతరం ఈ షూట్ చేశారని, తనకు తెలివివచ్చిన తర్వాత ఈ విషయంపై ముంబై పోలీసులకు పిర్యాదు చేశానని ఆమె తెలిపారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని మాజీ వీవీఎన్ మిస్ ఇండియా యూనివర్స్ 2019 విజేత పారి పాశ్వాన్ పేర్కొన్నారు.