షాబాద్ : కూలీ పనికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన షాబాద్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సర్దార్నగర్ గ్రామంలోని గోనెల రమేశ్ (40) ఈ నెల 9న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇప్పటివరకు తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వెతికిన ప్రయోజనం లేకపోవడంతో మంగళవారం షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి వెళ్లినప్పుడు రమేశ్ ఒంటిపై తెల్ల చొక్క, పచ్చ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. చామనచాయ రంగు కలిగిన ఆయన తెలుగు, హింది భాషలు మాట్లాడుతారని చెప్పారు.
షాద్నగర్ జానంపేటకు చెందిన రమేశ్ తన భార్య పూజిత తల్లిగారు ఊరైన సర్దార్నగర్లో ఉంటూ రోజువారి కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మామ మర్పల్లి బాల్రాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రమేశ్ ఆచూకీ తెలిసిన వారు షాబాద్ పోలీ స్టేషన్ లేదా ఫోన్ నంబర్ 9666902102కు సమాచార అందించాలని కోరారు.